టెంకాయ లో వంకాయ తీస్తే కొబ్బరికాయ
ఇదేనా ఇండియానాలో విమానయాన భద్రతా తనికిలు
శీర్షిక చదివి .. ఏమిటి సమాధానం విచిత్రంగా ఉందా..తల తిరుగుతుందా వీడికి అనుకుంటున్నారా. వ్యక్తిగతం పేరుతో రాస్తున్న ఈ వ్యాసాన్ని చదివితే మీకే అర్థమవుతుంది.సెల్ ఫోన్లు సిల్లి కబుర్లు ఆన్లైన్ గేములు లేని ఆ రోజుల్లో విద్యార్థులు ఖాళీ సమయంలో వీధుల్లో ఆడుకుంటూ పెద్దలతో గడిపేవారు. పెద్దలు విద్యార్థులకు ఎన్ని తెలివితేటలు ఉన్నాయో తెలుసుకోవడానికి కొన్ని ప్రశ్నలు వేసేవారు. అందులో ఒకటి టెంకాయలో నుంచి వంకాయ (One kaya -Ten kaya) తీసివేస్తే ఎంత అని ప్రశ్న వేసేవారు. పిల్లల గుంపులో ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెప్పేవారు. అందులో ఒకరు “తొమ్మిది” అని తెలుగులో, మరోక్కరు “నైన్ కయీ” అని అటు టింగ్లిష్ల్ లో, తెలివి కలిగి బుర్రతో అలోచించి … భావవ్యక్తీకరణ తెలిసిన మూడో విద్యార్థి నిదానంగా సరియైన సమాధానం చెప్పేవాడు. మూడో వ్యక్తి చెప్పిన సమాధానం భావవ్యక్తీకరణతో చెప్పినది, అదే “టెంకాయలో వంకాయ తియ్యడము జరగదు”. ఇదే అసలైన సమాధానం అటు ఇంగ్లీష్కు ఇటు తెలుగు కు సంబంధించినది. బియ్యము ఉడికాయో లేదో తెలుసుకోవాలంటే ఎలా అని అడిగేవారు. తెలివైన సమాధానం ఒక్క మెతుకు చూస్తే చాలు అనేది. కొందరైతే మొత్తం చూడాలి అని చెప్పేవారు.దీన్నే పరిసరాల పరిజ్ఞానం అంటారు. చిన్నతనంలో బియ్యం ఉడకడం గురించి తెలియడం కష్టం. అమ్మ కష్టం తెలుసుకుంటే గాని. దీన్నే భావవ్యక్తీకరణ ఇంగ్లీషులో అయితే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటారు. కానీ ఓవర్ ఫ్లో ఆఫ్ కమ్యూనికేషన్ అతి విద్య అనర్థదాయకం అని భావించిన విద్యార్థి ఈమధ్య వంకాయ లో నుంచి టెంకాయ తీస్తే కొబ్బరికాయ అనే స్థాయికి వచ్చాడు. తన వృత్తిలో భాగంగా దేశీయ విమానాల్లో ప్రయాణిస్తూ ఇటీవల ఓ విదేశీయ ప్రయాణము తరువాత ఆయనకు ఓ సమస్య తీవ్రంగా వేధిస్తుంది. రోడ్డు మార్గంలో ఆ దేశానికి వెళ్లిన ఆయన కు అక్కడే చెకింగ్ అధికారులు ల్యాప్టాప్ ను బ్యాగ్ నుంచి తీసి చేతితో పట్టుకోమని స్కానర్లో పెట్టరాదు అని చూసించారు. ఎందుకు అని కుతూహలంగా అడగగా స్కానర్లో లాప్టాప్ పెట్టరాదు ప్రమాదకరం అని వాళ్ళు చాలా సంస్కారంగా చెప్పారు . ఓ ఆలనా మా ఎయిర్పోర్ట్లో తెగ స్కానర్ లో పెట్టి ట్రే లో పెట్టి స్కాన్ చేసేస్తారు అని అనుకున్నా. వారిముందు మన దేశముగురించి చెప్పడము ఎందుకు. రాయప్రోలు అన్నారు ఏదేశము ఎగినా ఎందు కాలిడినా పొగడరా నీదేశాన్ని అనిగుర్తుకు వచ్చి . తిరుగు ప్రయాణములో కూడా అలాగే చెప్పారు. అంతకంటే ఎక్కువ విషయం చెప్పడం సందర్భం కాదు. మరో సందర్భంలో ఆ విషయం తెలుసుకుందాం. ఇప్పుడు మదిని వేస్తున్న విషయం కొబ్బరికాయ… అదేనండి నారీ కేలం..అదే గుడికి వెళ్తే మహా ప్రసాదం. ఇది కూడా మత విశ్వాసాలకు సంబంధించిన విషయం. అందుకే తీవ్రంగా ఆలోచిస్తున్నాడు. ఈ రచయిత. ఈ దేశంలో రాయడం కంట ఇంకేం చేయగలం.
దీనికి కారణం దేశములో ఇంగ్లీష్కు స్థానిక భాషలకు మధ్య చాలా దూరము పెరిగిపోతుంది రాతలన్నీ ఇంగ్లీష్ లోనూ చేతలన్నీ స్థానిక భాషల్లోనూ జరుగుతూ గందర గోళం సృష్టిస్తున్నాయి అనేది తన అభిప్రాయం.. పరిశోధనలో తెలుసుకున్న విషయం.ప్రతి సంస్థలోనూ వివిధ భాషలకు చెందిన వ్యక్తులు పని చేస్తూ ఉంటారు కానీ ఆదేశాలు మాత్రం ఇంగ్లీషులో మాత్రమే ఉంటాయి.ఇందులో కంప్యూటర్ యుగంలో ఇంగ్లాండ్ ఇంగ్లీష్ అమెరికా ఇంగ్లీష్ కలిసి అర్థాలు మారిపోతున్నాయి. ఇది కాస్త వ్యక్తులు, సంస్థలకు మధ్యన చాలా దూరము పెంచుతుంది. మన దేశములో కాస్త సంపన్నులైన వారు దేవాలయ సందర్శనకు విమానయాన ప్రయాణాన్ని ఎంచుకుంటారు. సమయం ఆదా చేయడం కోసం సౌకర్యవంతమైన ప్రయాణం కోసం. ఏ పనిమీద ఎక్కడకెళ్లినా స్థానిక ప్రాముఖ్యత ఉన్న దేవాలయాలను సందర్శించడం సర్వసాధారణం. ఇక్కడే వచ్చింది అసలు సమస్య తిరుగు ప్రయాణములో దేవుడి గుడిలో ఇచ్చిన కొబ్బర చిప్ప.. టెంకాయి.. లేదా కొబ్బరికాయ ప్రసాదం తీసుకురావడం ఆనవాయితీ. హిందూ సంస్కృతిలో దేవుడి ప్రసాదానికి అంత ప్రాముఖ్యత ఉంటుంది. ప్రసాదం కళ్ళకు హద్దుకొని మరి తింటారు. అదే ప్రసాదం సొంత ఇంటికి తీసుకెళ్ళి అందరి కుటుంబ సభ్యులతో కలిసి తింటే దానిలో ఆనందమే వేరు. కానీ ఇక్కడ వచ్చిన సమస్య అంతా విమానయాన ప్రయాణికులకు.
ఎయిర్పోర్ట్ భద్రతా విభాగాన్ని చూసే కేంద్ర పారిశ్రామిక భద్రతా దళము (సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)) తీరు కొబ్బరికాయతో తలబద్దలు కొట్టుకున్నా అర్ధముకాని మిస్టరీ .కొబ్బరి ప్రసాదము మీద ఎవరి కళ్ళు పడ్డాయో .. పచ్చడి కోసము ఎవరు కక్కుర్తి పడుతున్నారో అర్ధము కాని విషయము. సి ఐ ఎస్ ప్ వారి సంస్థ 1969లో మార్చ్ 12న పుట్టింది. కానీ వీళ్ళకి తుత్తరపాటు అని వారికి 56 ఏళ్ళు పూర్తిచేసుకున్న వేరు మర్చి 7 నే రైజింగ్ డే జరుపుకున్నట్టు కేంద్ర హోమ్ మంత్రి ఆ వేడుకలకు హాజరు అయ్యారు అని వార్తల్లో చదివాము. ఈ రోజు మార్చ్ 10 వారి వార్షికోత్సవం అని ప్రముఖ పత్రికలు రాశాయి. అంతర్జాలములో మర్చి 12 వారి రైజింగ్ డే అని వుంది. ఎప్పుడు జరుపుకుంటే ఏమి ఈసంధర్బముగా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూనే కొన్ని విషయాలు తెలుపుదామని ప్రయత్నం చేస్తున్నా. ఈ వ్యాసం వారికి అంకితం ఇస్తూ. విమానయాన ప్రయాణికులకు గౌరవం కల్పిస్తూ వారి విభాగం మరింత వర్ధిల్లాలని ఆశిస్తున్నాను. కేవలం 2,800 మంది సిబ్బంది తో మూడు బెటాలియన్లు గా పుట్టిన ఈ విభాగం నేడు 1,88,000 మంది సిబ్బంది కి చేరుకొని దేశములోనే అత్యంత పెద్ద భద్రతా విభాగముగా రికార్డు నెలకొల్పింది. పరిశ్రమలు, పోర్టులు భద్రతాతో పాటు చత్తీస్గడ్ లోని బస్టర్ ప్రాంతములోని అసాంఘిక శక్తులు తోశక్తుల తో పోరాటంలో ముందుంటుంది.
ఎయిర్పోర్ట్ భద్రత విషయానికివస్తే, ప్రయాణికులు పట్ల అమర్యాదగా ప్రవర్తిస్తారు అనే అపవాదు పౌరుల్లోనూ, నెటిజన్లలో ఉంది. దేశములోని చాలా ఎయిర్పోర్ట్లు ప్రైవేటు చేతిలోకి వెళ్లిపోయాయి. వారి చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోయారు అనే అపవాదు ఉంది. భద్రతా తనిఖీలలో నిర్దిష్ట ప్రమాణాలు పాటించకుండా ఎవరికీ వారే భద్రతా తనిఖీలు రూపొందించుకొని స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటున్నారు అనే అపవాదు ఉంది. తనిఖీలకు భద్రతా యంత్రాలు ఉన్నా వ్యక్తిగతంగా జేబులో రూపాయి చిల్లర ఉన్నా మిషన్లో లో పెద్ద శబ్దాలు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తారు అని ఆరోపణలు ఉన్నాయి. ఓ ప్రయాణికుడు కాశీకి తన అమ్మ ఆస్తికలు కలపడానికి మొదటిసారి విమానం ఎక్కడానికి ప్రయత్నించినప్పుడు అతనిని భద్రతా తనిఖీలు పేరుతో పూర్తిగా వేధించారనేది ఆరోపణ. హిందీలోనే మాట్లాడుతున్న సిఐఎస్ఎఫ్ సిబ్బంది ఏం చెప్తున్నారో అర్థం కాక అయోమయంలో పడ్డాడు ఆ ప్రయాణికుడు. చివరకు తోటి ప్రయాణికులతో మీ అండర్వేర్ లో ఏదో ఉంది చూసుకోండి అని చెప్పారట. అంతా వెతికితే మల్తాడుకు ఓ పిన్నిస్ ఉన్నట్లు గుర్తించాడు ఆ ప్రయాణికుడు. తోటి ప్రయాణికులు సహాయంతో మరోసారి చెకింగ్ కి వెళ్లి లోపలికి ప్రయాణించాడు. విషయం ఏంటంటే చాలామందికి మలతాడుకు లేదా పుస్తెలతాడుకు పిన్నిసులు ఉంచుకోవడం అలవాటు. పిన్నిసులు అత్యవసర పరిస్థితుల్లో ఎంతో ఉపయోగపడతాయి. బటన్లు ఊడిపోయిన జిప్పులు ఫెయిల్, బట్టలు చిరిగిపోయిన కప్పుకోవడానికి అదో సాధనం. సిఐఎస్ఎఫ్ అధికారులు హిందీలో మాట్లాడిన మాటలు ఆయనకు అర్థం గాక తీవ్ర గంద్ర గోలానికి గురయ్యాడు. మరోప్రయానికిని బ్యాగులో షేవింగ్ కిట్లో షేవింగ్ బ్లేడ్ ను స్కానర్లో గుర్తించి తనిఖీ పూర్తీ అయినతరువాత వెనుకకు పిలిచి బ్యాగ్ విప్పి ఆ ప్రమాదకర వస్తువును తొలగించారు . ప్రయాణికుడు ఇతర ప్రయాణికులముందు అవమాన బరానికిగురిఅయ్యారు . ఇందులో తెలుసుకోవాల్సిన నీతి ఏమిటిఅంటే మనమే తప్పులు ఎలా చెయ్యవచ్చు నేర్పిస్తున్నాము. ఒక ఎయిర్పోర్టులో ఓ ప్రయాణికిని భద్రతా సిబ్బంది తీవ్రంగా వేధించారు అతను తన ఆవేశాన్ని తట్టుకోలేక నా బ్యాగేజ్ లో “బాంబు” ఉందా అని ఆవేశంతో అరిచాడు.అంతే ఎయిర్పోర్ట్లో బాంబు అనే మాట వాడితే కేసు నమోదు చేస్తారట అలాగే.. అరెస్టు కూడా చేసేసారు. అదో పెద్ద వార్త అన్ని పత్రికలు ప్రముఖంగా ప్రచురించి ఆ ప్రయాణికుని పరువు తీసేశారు. అతను ప్రయాణిస్తున్న ప్రయాణం వాయిదా పడిందా తను తదుపరి గమ్యం ఏమిటి ఎంత నష్టపోయాడో ఎవరూ రాయలేదు.అయినా ఏర్పోర్టు భద్రతా విభాగము కు అరెస్టు చేసే అధికారము లేదు.
కేవలం ఈ మెటల్ డిటెక్టర్లు ఇనుమును మాత్రమే గుర్తిస్తాయా అనే సందేహం కలుగుతుంది. రూపాయి కాయిన్ లేదా చిల్లర పైసలు చూపించమని డిమాండ్ చేయడం ద్వారా వీరి చెకింగ్ నైపుణ్యం తెలుస్తుంది. ఫ్లైట్ జర్నీలో పెన్ పెట్టుకొని ప్రయాణికుడు ఉండరు. ఆ పెన్నులను కాప్ తీసి చూడడం, వారి మెటల్ డిటెక్టర్ ద్వారా బంధం ఎంతగా పనిచేస్తుందో అర్థం అవుతుంది. మెటల్ డిటెక్టర్ ద్వారా బంధం దాటిన తర్వాత కూడా పెన్ను క్యాప్ లు ఓపెన్ చేసి ముంబై ఎయిర్పోర్ట్లో ఒక సెక్యూరిటీ గార్డు చూడడం విచిత్రరము. సరేలే వాడి పని వాడిది అనుకున్న ఆ ప్రయాణికుడు సెక్యూరిటీ జోన్ దాటి లోపలకు వెళితే అక్కడ కత్తి లాంటి పెన్నులు అమ్మడము కనిపించింది. ఈ దేశము ఇంతే ఎవరు మార్చలేరు అని నిట్టూర్పు తో తన గమ్యస్థానము చేరుకున్నారు. మరో సారి ఢిల్లీ ఎయిర్పోర్ట్లో భద్రతా తనిఖీలకు వెళ్ళినప్పుడు జేబులో పెన్ను తో ఓ సీనియర్ సిటిజన్ ప్రవేశించారు. తాను ఎదో తప్పుచేసినట్టు కసిరి జేబులో పెన్నులు ట్రే లో వేసి స్కానింగ్ చెయ్యమని చూసించారు. చివరకు విసిగి వేసారిపోయిన అయన కళ్ళ జోళ్ళు కూడా ట్రే లో విసురుగా పడేసారు. పెన్నులు కూడా ట్రైన్లో వేసి స్కానింగ్ చేయించాలని అక్కడ సెక్యూరిటీ గార్డ్ కోరడం తనకు చాలా కోపాన్ని తెప్పించింది . ఎవరు అడుగుతారు ఈదేశములో ఎవరి స్వార్ధము వారిది. ఆ ముసలాయన కంటే ముందు ఎల్లిపోవాలి అనే ఆందోళన తప్ప. ఒక విమానము దిగి మరో విమానము మారడము ఎయిర్పోర్ట్ లోపలే జరుగుతుంది. ఇంటర్ ట్రాన్సిట్ పాసింజర్లకు మరోసారి చెక్ చేయడం అనవసర వృధా ప్రయాస ఇరువురికి. ఇది కేవలం సిఐఎస్ఎఫ్ సిబ్బందికి అనవసరంగా జీతాలు చెల్లించడమే.కొన్ని డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లలో కాళ్ళ చెప్పులు కూడా తీసి ట్రేలో వేసి స్కాన్ చేయడం విచిత్రం. కొన్ని ఎయిర్పోర్ట్లలో షూస్ను కూడా తీయనసవరం లేదని అదే భద్రతా సిబ్బంది అనడము మరింత విచిత్రం. బెంగళూరు ఎయిర్ పోర్ట్ లో అయితే మహిళల బంగారు ఆభరణాలు కూడా తీసి ట్రేలో పెట్టమని కరెన్సీ నోట్లు కూడా ట్రేలో పెట్టమని అన్ని కూడా పెట్టమని బోర్డులు పెట్టిన దృశ్యం చాలా బాధ కలిగించింది. ఇదంతా చూసిన ఓ ప్రయాణికుడు నేనేమీ అంతర్జాతీయ ప్రయాణం చేయడం లేదు కదా నేనేమీ తప్పుగా అంతర్జాతీయ టెర్మినల్ లోకి ప్రయాణించానా అనే సందేహంలోకి వెళ్లిపోయాడు. అదే ఎయిర్పోర్ట్లో బాడీ స్కానర్ ఉండటం కూడా పెద్ద విచిత్రం. బాడీ స్కానర్ల పై నిషేధం ఉందని కొన్ని మీడియా వర్గాల కథనం. మహిళలు సెక్యూరిటీ చెకింగ్ లో మరింత దారుణముగా వ్యవహరిస్తారు అనే అపవాదు వుంది . ఆ విషయాలు రాయడానికి పనికిరానివి. ముంబై నుంచి బెంగుళూరు విమానాశ్రము ద్వారా విశాఖపట్నం వెళుతున్న ఓ ప్రయాణికుని బాగు లో ముంబై సెక్యూరిటీ అనుమితించిన పాండ్స్ పేస్ పౌడర్ బెంగళూరు సి ఐ ఎస్ ఎఫ్ తొలంగించారు . అంతటితో ఆగకుండా అతని టికెట్ నుమ్బెర్ను రిజిస్టర్లో నమోదు చేసి బ్లాక్ మెయిలింగ్ ప్రయత్నమూ చేసారు. వీళ్ళు వెర్రి వెంగలు అప్పులు అని అప్రయాణికుడు ఖాతరు చెయ్యకుండా వెళ్ళిపోతూ టన్నులు కొద్దీ …. ప్రైవేట్ పోర్టులు ద్వారా వస్తుంది అని పత్రికలు రాస్తున్నాయి మీ ముడ్డి మీరు చూసుకోండి అన్నారట . మరి అక్కడి బాడీ స్కానర్కు అనుమతి ఉందా లేదా అనేది సిఐఎస్ఎఫ్ వాళ్ళకే తెలియాలి. గందరగోళం గోవిందయ్యలు అందరూ. చాలామంది ఎయిర్పోర్టులో బెల్టుతో సెక్యూరిటీ లోపలికి ప్రవేశిస్తే అక్కడ సెక్యూరిటీ గార్డ్ బెల్ట్ నిఖల్ దొ అంటే మొత్తం ఒంటిని మీద ఉన్న అన్ని విప్పేసి సెక్యూరిటీ చెక్ కు వెళ్తున్నారు చాలామంది. ఓ ప్రయాణికుడు ఈ ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ వాళ్ళ బాధపడలేక బెల్ట్ ధరించడం కూడా మానేశారని చెప్పడం విశేషం. కొన్ని కొన్ని ఎయిర్పోర్ట్ టెర్మినల్స్ లో కళ్లద్దాలు తీసి స్కానర్ లో పెట్టమనడం విచిత్రం. వీరి భాష అంతా హిందీలోనే ఉంటుంది స్థానికులకు స్థానిక ఎయిర్పోర్టులో అవకాశం కల్పిస్తే కొంత గందరగోళం తగ్గుతుంది. ఏది నిషేధం ఎలా చెక్ చేయాలి అనే విషయంపై ఈ దేశంలోని సరైన చట్టం లేదు.బెంగళూరులోని క్యాంపగౌడ ఎయిర్పోర్టులో భారీ స్కానర్లు పెట్టేశారు. వాటి ముందు ప్రయాణికులను కోతులు ఆడించే వాడిలా సిఐఎస్ఎఫ్ వాళ్ళు ప్రయాణికులను ఆడింపు చేస్తున్నారు. జేబులో ఉన్న రుమాలు కాగితాలు కూడా తీసి పూర్తిగా ఓపెన్ చేసి చూపించమనడం ఈ బాడీ స్కానర్ల భద్రతా సిబ్బంది చేస్తున్న పని. బట్టలూడదీసి స్కానింగ్ చేస్తే ఆ భారీ స్కానర్ ఎందుకు. ఇంత తతంగం చేస్తే ఈ భారీ స్కానర్లు ఎందుకు సీక్రెట్ గా ఓ రూమ్ లోకి తీసుకెళ్లి మొత్తం చెక్ చేసేయొచ్చు కదా. దమ్ముంటే భారీ స్కానర్లు వాటి ద్వారా వెళ్లగానే మొత్తం చెప్పేయాలి. వాళ్ల స్కానర్ బొమ్మకు అనుగుణంగా అటూ ఇటూ కదలమనడం నటింప చేయమనడం మరింత విచిత్రం. ఇదేనా మన భద్రత. డొమెస్టిక్ విమానయానం చేసిన చాలామంది అభిప్రాయంలో భద్రతా మిషిన్లు బాగా పనిచేస్తాయి.. కేవలం భద్రతాధికారులు తప్పులు ఉన్నాయనేది అభిప్రాయం. ప్రయాణికుల వంటిమీద చెయ్యి వేయాల్సిన అవసరం లేదని కానీ మిషన్లతో తనిఖీ చేసిన తర్వాత కూడా ఒళ్లంతా తడవడం తీవ్ర ఆందోళన కరం.
ఇప్పుడీ కొబ్బరికాయ నిషేధం విషయంలోకి రండి. హిందూ సంస్కృతిలో ఏంతో ప్రాధాన్యత వున్న కొబ్బరి ప్రసాదం…కొబ్బరికాయ. మన విమానాలలో కొబ్బరి కాయ తీసుకువెళ్ళడము నిషేధము. ఎన్నో ఎయిర్పోర్ట్లలో కొబ్బరి ప్రసాదం ప్రయాణికుల బ్యాగ్ల నుండి తీసి చెత్తబుట్టలో వేస్తున్నారు. ఇది హిందువుల మనోభావాలను దెబ్బతీస్తుంది. కొబ్బరి చిప్ప లేదా కొబ్బరి కాయ తీసుకు వెళ్లవచ్చా లేదా అనే విషయంలో విమానయాన సంస్థలకు భద్రతా సిబ్బందికి మధ్య ఒక మిధ్యగా బావ దారిద్రం తాండవిస్తోంది. కొన్ని విమానయాన సంస్థలు కొబ్బరి కాయలను అనుమతించము కానీ కొబ్బరి ముక్కలుగా చేసి తీసుకెళ్లవచ్చు అని వాళ్లే వెబ్సైట్లో చూపిస్తున్నారు. దేశం అంతా ప్రైవేటు విమానయాన సంస్థలు రాజ్యం ఏలుతున్నాయి. ఈ సిఐఎస్ఎఫ్ ప్రభుత్వ భద్రత సిబ్బందికి ఇరువురికి మధ్య సరైన సమన్వయము లేదు అనేది వాస్తవం. ఇరువురికి సరైన చెక్ ఇన్ బ్యాగేజ్ లో కొబ్బరి ప్రసాదం తీసుకెళ్లవచ్చా లేదా హ్యాండ్ బ్యాగేజ్ లో తీసుకెళ్లవచ్చా. దీనిలో కూడా ఒక సరైన నిర్ణయం లేదు. నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే, ఎండు కొబ్బరి తీసుకు వెళ్ళడం నిషేధం. అయినా ఎండుకొబ్బరిని ఎవరు తీసుకెళ్తారు ఫ్లైట్లో. ప్రసాదం అంటే పచ్చి కొబ్బరి మాత్రమే అ పచ్చి కొబ్బరి నుంచి పాలు మాత్రమే వస్తాయి. ఎండు కొబ్బరి ఎన్నో రోజులు ఎండలో పెట్టి మండిస్తే కూడా కాలదు.ఎండు కొబ్బరిని గానుగ నూనెలో వేసి అరగంట సేపు నలిపితే కొబ్బరి నూనె వస్తుంది. ఆ కొబ్బరి నూనె కూడా నేరుగా మండించిన మండదు. ఆ కొబ్బరి నూనె కాలాలి అంటే లేదు మండాలి అంటే ఓ ఒత్తిని వేసి వెలిగిస్తే జ్యోతి వెలుగుతుంది. అది ఎంతో నిదానంగా కొంచెం కొంచెం కొబ్బరి నూనె పీల్చుకుంటూ వెలుగుతుంది.కొబ్బరి చిప్ప పైన లేదు కొబ్బరికాయలు పైన ఉన్న పీచు పదార్థం ఏమైనా ప్రమాదకరమంటే అందులో కూడా ఎలాంటి ప్రమాదం కనిపించట్లేదు. దీన్ని అగ్గిపెట్టితో వెలిగించిన వెలిగే పరిస్థితి లేదు. ఒకవేళ పైన ఉన్న పీచు పదార్థం ప్రమాదకరమైతే ప్రత్యేకమైన కవర్లను ఇచ్చి భద్రపరిచి ప్రయాణికులకు అప్పగించాల్సిన అవసరం భద్రతా సిబ్బందికి ఎయిర్ లైన్స్ సిబ్బందికి ఉంది. కొబ్బరి పీచు కంటే మనం తీసుకెళ్తున్న అన్ని పదార్థాలు మండే స్వభావం కలిగినవే. నేరుగా మండే అవకాశం వున్న బట్టలు ప్లాస్టిక్ బ్యాగులు ఎన్నో వస్తువులు కంటే ప్రమాదకరం కాదు కొబ్బరి. గూగుల్ మొత్తమును వెతికిన కొబ్బరి అనుమతి గురించి సరైనటువంటి సమాచారం లేదు.ఎండు కొబ్బరి మాత్రమే అనుమతించరాదని డి జి సి ఏ, బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ కొన్ని సూచనలు చేశాయి మాత్రమే.ఈ విషయము ఎక్కడ బోర్డులు లో రాసి లేదు ఇంగ్లీషులో కానీ హిందీలో కానీ ఇది గమనార్హము . పచ్చి కొబ్బరి విషయంలో ఎలాంటి నిషేధం లేదు ప్రమాదము కాదు. ఇప్పటికే దేశంలో చాలా ప్రైవేట్ పోర్టులో ఏర్పడ్డాయి వాటిల్లో సిఐఎస్ఎఫ్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడం లేదు. ప్రైవేట్ సెక్యూరిటీని ప్రోత్సహిస్తున్నారు వారు తక్కువ రేటుకి కూడా వస్తారు. అప్పుడే కొన్ని ఎయిర్పోర్టులో సిఐఎస్ఎఫ్ తగ్గించి ప్రైవేట్ సెక్యూరిటీని కొన్ని మార్గాల్లో పెట్టిన విషయం అందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఏర్పాట్లు కూడా క్యాంపగౌడ ఏర్పోర్ట్ ఆదాని ఎయిర్పోర్ట్ పేర్లతో ప్రైవేట్ వారి చేతుల్లోకి వెళ్లిపోయాయి. లార్డ్ అయ్యప్ప మాలధారంలో ఎంతో ప్రాముఖ్యమైనది ఇరుముడి. ఇరుముడిలో కొబ్బరికాయలు అనేవి ప్రధాన పూజా వస్తువులు. ఆ కొబ్బరికాయలు కూడా స్వచ్ఛమైన నేతితో నింపి తీసుకువెళ్లి ఆ స్వామికి అర్పించడం పూజ క్రతువు. కేవలము అయ్యప్ప భక్తులను మాత్రమే కొంతకాలం మాత్రమే కొబ్బరికాయలు తీసుకువెళ్లడానికి అనుమతిస్తామని కేంద్ర విమానయాన మంత్రి ప్రకటించడం విడ్డూరం. ఆ కొబ్బరికాయల్ని కూడా అత్యంత సామర్థవంతమైనటువంటి స్కానర్ ద్వారా పరీక్షిస్తామని ప్రకటించడం విచిత్రం. ఒకవేళ కొబ్బరికాయ మండే స్వభావం ఉంటే అయ్యప్ప స్వామి ఇరుముడులో నేతితో నింపిన కొబ్బరికాయలు ఉంటాయి వాటిని స్కాన్ చేయడం ఎంతవరకు భద్రం. ఇప్పటివరకు మనం నావిగేషన్ వ్యవస్థ ఇంప్రూవ్ చేసుకోలేదనేది ఓ వాదన ఉంది. ఇంకా మనం కొబ్బరికాయ స్థాయిలో ఉంటే ఎట్లా. వర్షం పడితే ఫ్లైట్ ల్యాండింగ్ అవ్వదు.. ఉత్తర భారతంలోని పంత్ నగర్ లాంటి ఎయిర్పోర్టుల్లో మంచు కురిస్తే ఫ్లైట్ ల్యాండ్ అవ్వదు. అటు నుంచి దిగే ప్రయాణికులు ఇటునుంచి తిరుగు ప్రయాణం అయ్యే ప్రయాణికులు గుండెల్లో గుబులతో ఫ్లైట్ ల్యాండ్ అయితే చాలు ఓ దేవుడా అని ఊపిరి బిగించి ఎదురుచూస్తారు. ఫ్లైట్ లాండింగ్ శబ్దము వినిపిస్తుంటే .. నీవు వున్నావు దేముడా అనుకుంటారు.మరి మనం ఎక్కడున్నాము. భద్రతా సిబ్బందికి కావలసినప్పుడు కొబ్బరి మూటలు సారీ ఇరుముడులు ఇప్పొచ్చని ప్రకటించడం ఆదేశించడం అరిష్టానికి నిదర్శనం. మనం దేవుడిని నమ్మనప్పుడు ఇంకేముంది ఈ ప్రపంచం. ఆయనా ప్రమాదకరం ఆయన వాటిని తలమీద పెట్టుకుని ..బ్యాగులో పెట్టుకుని ప్రయాణించే సాహసికులు ఈ దేశములో లేరు. ఓ బ్రిటిష్ అధికారి భారతదేశంలోని రైల్వే ట్రాక్ లను పరిశీలించిన తర్వాత నాకు ఇప్పుడే దేవుడు ఉన్నాడు అని నమ్మకం కలిగింది అని అన్నారట. ఎందుకంటే మీ రైల్వే ట్రాక్లు అంత బలంగా ఉన్నాయి అని ఆయన ఉద్దేశం చెప్పారట. మీ దేశాన్ని అంతా ఆ దేవుడే రక్షిస్తున్నాడు.అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నారు అన్నారట. ఇది ఓ అధికారి వాస్తవ గాధ. ఆయన చెప్తే ట్రైన్ ని అరగంట ఆపేస్తారు.. కానీ ఓ మీటింగ్ కోసం ఫ్లైట్లో ప్రయాణించారు ఆ అధికారి. ఎంత అధికారైనా దేవుని ముందు భక్తుడే కదా. పనిలో పనిగా ఓ దేవాలయాన్ని సందర్శించారు అక్కడి పూజారులు ఆయనకు కొబ్బరికాయని ప్రసాదంగా బహుకరించారు. తీరా ఎయిర్పోర్ట్ కు చేరాక ఆ ప్రసాదాన్ని సెక్యూరిటీ భద్రతాధికారులు తీసుకొని చెత్తబుట్టలో వేయడానికి ప్రయత్నించారట. హిందీ ఇంగ్లీషులో మాట్లాడిన ఆ అధికారికి సిఐఎస్ఎఫ్ అధికారులు సరైన సమాధానం ఇవ్వకుండా నాట్ అలౌడ్ అనే బదులిచ్చారట. ప్రసాదానికి ప్రాముఖ్యత ఇచ్చి ఎలా అయినా ప్రసాదాన్ని తీసుకువెళ్లాలని పట్టుబట్టారట అధికారి. పలుకుబడి కలిగిన అధికారి తన సొంత డిపార్ట్మెంట్ అధికారులకు ఈవిషయం ఫోన్ చేసి ఎట్లాగైనా ఈ ప్రసాదాన్ని తన ఇంటికి పంపించాలని ఎయిర్పోర్ట్ సెక్యూరిటీని ఆదేశించమని కోరారట. అది జరిగే పని కాదు కాని మీరు ప్రయాణిస్తున్న ఎయిర్ లైన్స్ సిబ్బందిని పిలిచి వాళ్ళకి మీ ప్రసాదాన్ని అందజేయండి మేము దాన్ని తీసుకొని మీ ఇంటికి ఎయిర్ కార్గోలో పంపిస్తాము అని సిబ్బంది చెప్పారట. ఎంతైనా ఎయిర్లైన్స్ సిబ్బంది ప్రైవేట్ వారు కదా ఏది చెప్తే అది వింటారు ఏది చెప్తే అది చేస్తారు వాళ్లకి కావలసింది వ్యాపారం.. కావలసింది జాబ్ సెక్యూరిటీ. అదే ప్రభుత్వంలో ఉంటే కళ్ళు కాస్త నెత్తికెక్కిపోతాయి. అనుకున్నట్లుగానే ఆయన విమానము సిబ్బందిని పిలిచి తన ప్రసాదాన్ని ఇచ్చి భద్రంగా ఉంచి తన సిబ్బంది వచ్చినప్పుడు అప్పగించమని చెప్పారట. తాను ప్రసాదం అప్పగించిన ఎయిర్పోర్ట్ సిబ్బంది ఫోన్ నెంబర్ను తన కింద స్థాయి అధికారులకు తెలియజేశారు. కింద స్థాయి అధికారులు ఎయిర్లైన్స్ సిబ్బందితో సంప్రదించి ఆ ప్రసాదాన్ని భద్రంగా తీసుకొని తిరిగి ఫ్లైట్లోనే ఆయనకు పంపించారు. కేవలం ఒక కొబ్బరికాయ కోసం 1000 కొబ్బరికాయల ఖర్చయిన ఎయిర్ కార్గోలో ఆ ప్రసాదాన్ని పంపించగా ఆ ఉన్నత స్థాయి అధికారి ఎంతో ఆనందించారట. కొబ్బరి ప్రసాదాన్ని ఎయిర్లైన్స్ సిబ్బంది నుంచి అందుకున్న గంటలోపే ఎయిర్ కార్గో ద్వారా పంపించడం జరిగింది. ప్రసాదాన్ని ఎయిర్ కార్గో ద్వారా పంపించవచ్చా ఎలాంటి అభ్యంతరాలు ఉన్నాయని అడిగితే ఎలాంటి అభ్యంతరము లేదని చెప్పడం విచిత్రం
కొబ్బరికాయని పార్సిల్ చేసే ముందు కూడా ఇది కొబ్బరికాయ అని ఫ్లైట్ కొరియర్ లో అనుమతి చేస్తారా అని కోరగా నో ప్రాబ్లం అని ఓ డిక్లరేషన్ తీసుకొని మరి పార్సిల్ చేశారు.ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఎయిర్ కార్గోలో అనుమతిస్తున్న కొబ్బరికాయలను సాధారణ ఫ్లైట్లో ఎందుకు అనుమతించట్లేదు.
నేటి సాధారణ ప్రయాణిక్కడే రేపటి మంత్రి రేపటి ప్రధానమంత్రి లేదా ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కావచ్చు. అప్పుడు ఇవన్నీ గుర్తొస్తే ఏం జరుగుతుంది మీకు తెలుసు కదా. ఒకసారి అబ్దుల్ కలాం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గా ఉన్నప్పుడు ఆయన ఎయిర్పోర్ట్ తనిఖీ విభాగాన్ని దాటుతున్నప్పుడు అక్కడ సిబ్బంది చెక్ చేయకుండా బ్యాగులను లోపలికి అనుమతించారు. అది గమనించిన ఆయన తప్పనిసరిగా తన బ్యాగ్ ని చెక్ చేయాలని పట్టు పట్టి మరి స్కానింగ్ చేయించుకున్నారు. ఎందుకు అని తన వ్యక్తిగత సిబ్బంది అడగగా బ్యాగు తనదే గాని తన బ్యాగులో ఇంకెవరైనా ఏమైనా పెడితే తన భద్రత తో పాటు ఇతర ప్రయాణికుల భద్రత కూడా ముఖ్యమని చెప్పారు.
ఇది విజ్ఞుల బుద్ధి. అధికారంలోకి రాగానే వాళ్లకి అడ్డదారుల్లో ఫ్లైట్లో అనుమతిస్తుంటే. ప్రజల కష్టాలు పట్టించుకోని వారికి ఇది ఓ గుణపాఠం. వాస్తవాన్ని పరిశీలిస్తే కొబ్బరికాయ చూస్తే ఎందుకు భయపడుతున్నారు తెలిసింది. ఏదో ఒక హైజాక్ సందర్భంలో కొందరు దుండగులు కొబ్బరికాయను ఓ రూపంలో వాడుకొని బెదిరించినట్లు తెలిసింది… అది వంకాయ ఎందుకు కాకూడదు. ఇలాంటి విషయాలు చాలా సున్నితమైన విషయాలు మత విద్వేషాలను రెచ్చగొట్టేవి కూడా కావచ్చు. నేపాలీ టోపీ పెట్టుకున్నా దాన్ని కూడా తీసి స్కాన్ చేయిస్తున్నారు…మరి మన సింగ్లు వారి నెత్తిన పుట్టుకే టోపీని ఏంటో పవిత్రముగా భావిస్తారు. వారిని తొలగించమంటే వారు అసలు సున్నిత మనస్కులు
అతి ఎప్పుడు ఆనర్ధదాయకమే.
అమాయకుల మనసుల్లో అన్ని అనుమానాలను ప్రవేశపెడితే అది ప్రమాదకరమవుతాయి. ఎయిర్పోర్ట్ సెక్యూరిటీ భద్రత గేటు దగ్గర చిన్న పిల్లల చేతిలో బొమ్మలు లాక్కుంటున్నారు వాటర్ బాటిల్ లాక్కుంటున్నారు లోపల మాత్రం మద్యం ఎంత కావాలంటే అంత ఏ బొమ్మ కావాలంటే ఆ బొమ్మ ఏం కావాలంటే అది అమ్ముతున్నారు ఆ విషయం భద్రతా సిబ్బందికి తెలియదేమో. నిబంధనలకు మించి మద్యం సేవించి ఫ్లైట్ ఎక్కడం నేరం. అత్యంత ఆధునిక బారులను విమానాశ్రయం లోపల ఎలా పెడుతున్నారో.. అందరికీ తెలిసిందే. స్మోకింగ్ రూములు ఉంటాయి సిగరెట్లు అమ్ముతారు కానీ అన్ని నాలుగు రెట్లు అధిక ధరలకు అమ్ముతారు. దీన్ని బిజినెస్ అంటామా .. భద్రత అంటామా. అతిగా మద్యం సేవించి విమానంలో ప్రయాణించే ప్రయాణికులతో విమానంలోని సమస్య వస్తే ఇతర ప్రయాణికులు విమాన సిబ్బంది భద్రత ఎవరి బాధ్యత.
మన నీడను చూసి మనమే బెదిరిపోతే సెక్యూరిటీ సిబ్బందికి సామాన్యులకు కి తేడా ఏముంది. ఎయిర్పోర్ట్లో పని చేసే సిబ్బంది యూనిఫాంలో మార్చాల్సిన అవసరం కూడా ఉంది.జంగిల్ యూనిఫామ్ కు ఎయిర్పోర్ట్ కు ఎలాంటి సంబంధం లేదు.ఈ సిఐఎస్ఎఫ్ రైజిగ్ డే సందర్భంగా వారి విధులను వారు పరిరక్షించుకుంటూ మరింత ముందుకు వెళుతూ అభివృద్ధి చెందుతారని ఆశిద్దాం. నా చిన్నప్పుడు నా ప్రాథమిక విద్యాభ్యాసంలో స్నేహితులు.. పిన్నీస్ అనమనేవారు అప్పుడు మీ నాన్న పోలీస్ అనే వారు. ఓకే మంచిదే కదా తప్పేముంది అనుకునేవాడిని కానీ ఇప్పుడు అర్థమైంది. అసలు వాళ్లు పోలీస్ అనే వాళ్ళ ఫూలిష్ అనే వాళ్ల అని. అంతా అర్థం కావట్లేదు అయోమయం మనం అభివృద్ధి చెందుతున్నామా దిగజారుతున్నామా. దేశములోని శబరి పీఠము లో వెలిసిన స్వామి అంటే దేశ విదేశాలలో భక్తులువున్నారు రష్యా ఇతర దేశాలు నుచి ఇరుముడులతో వచ్చే భక్తులకు ఇండియన్ అయిర్పోర్టులు ఇరుముడులు తీసుకోని చెత్త బుట్టలో వేస్తె ఆలోచించండి. ఈమధ్య కేరళ పోలీసులు అత్యంత పవిత్ర పదునెట్టాంబడి పై ఎదో ఘనత సాధించిన వారిలా గ్రూప్ ఫొటోతీసుకుని సోషల్ మీడియా లో పోస్టుసేసారు …ఇక చూడాలి అయ్యప్పభక్తుల అవేశము. అంతే రాష్ట్ర డి జి పి తో సహా పొలిసు ఉన్నతాధికారులు పోలీస్ బ్యాండుతో అప్పాచి మేడే శరణము అయ్యప్ప …కన్నిమూల గణపతి ,,,స్వామి యే శరణము శరణము . ఒక్కటే పాఠ అదికూడా వైరల్ అయ్యింది . విషయము ఏమిటి అంటే దేముని పాద్దన చేసినప్పుడు షూస్ తీసివుండాల్సింది. ఇలా అయితే అభివృద్ధి చెందిన దేశాల వాళ్లు మన దేశానికి ఎలా వస్తారు ఎప్పుడు వస్తారు. అభివృద్ధి ఎలా చేస్తారు.. ఇదే మన పరిస్థితి. మన దేశము నుచి వెళ్లి పోయిన ఆ పందళ రాజాధి రాజు మహారాజు లార్డ్ అయ్యప్ప స్వామి తిరిగి మనదేశానికి ఎప్పుడు వస్తారు .. స్వామి శరణము .. అయ్యప్ప శరణము. తిరిగి రావా ఆదుకోవా అంటూ దేశ ప్రధాని తో సహా సామాన్యులు ఎదురుచూస్తున్నారు. నేను మాత్రమూ ఎదో ఎయిర్పోర్టు ప్రయాణములో ఎదో ఆలోచిస్తూ వున్నా కాస్త సమయాన్ని సరదాగా స్మోకింగ్ జోన్ లో గడుపుతూ ..ఎదో ఆలోచిస్తా . బోర్డింగ్ టైముకు ఫ్లైట్లోకి ప్రవేచించే ముందు గగన సఖులు స్వగామూపలుకుతూ ఉంటే వారి ముఖము చూడకుండా విమానం ద్వారబంధాన్ని మొక్కుతాను. ఎవరు ఆవిషయము గమనించరు …ఒక్క గగన సఖులు తప్ప . ఓ లోహవిహంగామా మా జీవితాలు గాలిలో దీపాలు ..భద్రత అంతా అభద్రత … ఆ లార్డ్ వెంకటేశ్వర స్వామి తన వాహన రూపాన్ని ఇలా మాకు ప్రసాదించి ప్రయాణములో సమయము ఆదా చేస్తున్నారు. కానీ ఆయనకు మేము ఏమి చెయ్యలేకపోతున్నాము … కనీసము అయన కొబ్బరి ప్రసాదము ఫ్లైట్ లోకి అనుమతి ఇచ్చే అవకాశము కల్పిచాలి అని ఆశ. స్వామియే శరణము అయ్యప్ప ఈ దేశాన్ని మీరే కాపాడాలి.
ప్రోటోకాల్ అనే పుస్తకము చదువుకోండి …
-కె.వి.ఆర్ ప్రసాద్, ప్రెసిడెంట్ మరియు మాస్ కమ్యూనికేటర్, విస్తరణ మాస్ కమ్యూనికేషన్ సొసైటీ ,