లేఖరి ప్రో సంస్థలో చేరిన విదుర

లేఖరి ప్రో సంస్థలో చేరిన విదుర

విశాఖపట్నం, ఏప్రిల్ 20: అక్షయ తృతీయ పర్వదినం సందర్భంగా, కొరికాన విదుర లేఖరి ప్రో సంస్థలో కోఆర్డినేటర్ (కమ్యూనికేషన్)గా చేరారు.

విదుర గాయత్రి డిగ్రీ కాలేజీ నుండి బిబిఎ పూర్తి చేసి, ప్రస్తుతం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎంబిఏ చదువుతున్నారు. చదువుతో పాటు పనిచేసి సంపాదించడం తన అభిరుచి అని ఆమె తెలిపారు.

లేఖరి ప్రో బ్రాండ్ భారత ప్రభుత్వ గుర్తింపు పొందిన ట్రేడ్‌మార్క్ అని, ప్రజా సమస్యలను సమర్థవంతమైన కమ్యూనికేషన్ ద్వారా పరిష్కరించే వినూత్న ఆలోచన అని ఆమె ప్రశంసించారు. ఈ సంస్థను జాతీయ మరియు అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లగలనని ఆమె ధైర్యంగా పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *